• January 28, 2022

‘ఏమాయ చేసావే’లో చై-సామ్.. విధి అలా కలిపిందా?

‘ఏమాయ చేసావే’లో చై-సామ్.. విధి అలా కలిపిందా?

    Naga Chaitanya Samantha Ye Maaya Chesave ఏమాయ చేసావే సినిమాతో సమంత నాగ చైతన్య కలిశారు. అక్కడ ఏర్పడిన స్నేహమే పెళ్లి వరకు తీసుకొచ్చింది. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న ఆ జంట ఇప్పుడు విడిపోయింది. మొత్తానికి చైసామ్ కథ ముగిసింది. ఇప్పుడు ఎవరి దారి వారే చూసుకున్నారు. విడిపోయి ఆనందంగా ఉన్నారు. ఎవరి సినిమా పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా హీరోయిన్ మహేశ్వరి కొన్ని విషయాలను చెప్పేసింది.

    ఏమాయ చేశావే సినిమాకు ముందుగా నాగ చైతన్య, సమంతలను అనుకోలేదట. ఈ సినిమాను తెలుగు తమిళంలో నిర్మించిన విషయం తెలిసిందే. తమిళంలో శింబు, త్రిష తెలుగులో.. నాగ చైతన్య సమంతలను పెట్టి గౌతమ్ మీనన్ తీశాడు. అయితే ఈ సినిమాకు మహేశ్వరికి సంబంధం ఉందట. ఎందుకంటే ఈ సినిమాను మొదటగా తన తమ్ముడితో తీయాలని అనుకున్నారట.

    గౌతమ్ మీనన్ దగ్గర తన తమ్ముడు కార్తీక్ అసిస్టెంట్‌గా పని చేశాడట. ఆ తరువాత కార్తీక్‌తోనే ఏమాయ చేశావే సినిమాను తీయాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కకి వెళ్లిందట. దీంతో కార్తీక్ ప్లేస్‌లోనే తమిళంలో శింబు త్రిషి, తెలుగు నాగ చైతన్య సమంతలను పెట్టి సినిమాను తీశారట. అలా మొత్తానికి ఇన్నేళ్ల తరువాత మహేశ్వరి ఈ నిజాన్ని చెప్పేసింది.

    చూస్తుంటే తన తమ్ముడి పేరు కార్తీక్. ఆ పేరుతోనే సినిమాలోనూ హీరో పేరును పెట్టి ఉంటాడేమో. మొత్తానికి మహేశ్వరి బ్రదర్ కార్తీక్ ఆ సినిమాను చేయకపోవడంతోనే నాగ చైతన్య సమంతలు కలిశారు. అలా ఈ ఇద్దరి కలవడానికే కార్తీక్ పక్కకి తప్పుకున్నాడేమో. మొత్తానికి చై సామ్‌లు మాత్రం ఇప్పుడు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు.

    Leave a Reply