• October 23, 2021

సినిమా ఈవెంట్లలో మంత్రులు.. అలా పరువు తీసుకుంటున్నారా?

సినిమా ఈవెంట్లలో మంత్రులు.. అలా పరువు తీసుకుంటున్నారా?

    సినిమాలు, రాజకీయాలు రెండూ కూడా ఎక్కడో ఓ చోట ముడిపడే ఉంటాయి. రెండూ కూడా ప్రజల్లో ఎక్కువ ఆదరణ పొందిన రంగాలే. అయితే క్రేజ్ విషయంలో ఈ రెండు ఒకే దారిలో నడిచినా అక్కడి పద్దతులు ఇక్కడి పద్దతులు, అక్కడి ప్రసంగాలు ఇక్కడి ప్రసంగాలు వేర్వేరుగా ఉంటాయి. ఇక కొందరు రాజకీయ నాయకులకు సినిమా నాలెడ్జ్ ఉంటుంది.. ఇంకొందరికీ ఉండదు.

    అయితే సినిమా ఈవెంట్‌కు వస్తుంటే కనీసం అది ఏంటి? దాంట్లో ఉన్న వాళ్ల పేర్లు ఏంటి? అనేది తెలుసుకుని వస్తే బాగుంటుంది. నిన్న వరంగల్‌లో జరిగిన రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ కూడా పొల్గొన్నారు. అయితే ఇందులో మంత్రి,ఎంపీలు ఇచ్చిన స్పీచు, అందులో పలికిన పేర్లు విని అక్కడికి వచ్చిన జనాలు నవ్వుకున్నారు.

    పూరి జగన్నాథ్ అని సరిగ్గా పేరు కూడా పలకలేకపోయాడు మంత్రి. పూరి కొడుకు పేరు ఆకాష్ అని కూడా తెలియదు. పేపర్ మీద రాసుకొచ్చుకుని కూడా తడబడ్డాడు. ఇక ఇదంతా ఒకెత్తు అయితే ఎంపీ పసునూరి దయాకర్ మాత్రం నవ్వులపాలయ్యాడు. విజయ్ దేవరకొండ పేరు కూడా తప్పుగా పలికేశాడు. అజయ్ దేవరకొండ అని తప్పుగా అనడంతో.. జనాలు పగలబడి నవ్వేశారు. అలా సినిమా ఈవెంట్లకు రావడం ఎందుకు ఇలా నవ్వుల పాలు కావడం ఎందుకు అని కొందరు కామెంట్లు పెడుతన్నారు.

    Leave a Reply