• November 28, 2021

ఎవ్వరినీ పట్టించుకోని దీప్తి సునయన!.. కావాలనే అలా చేసిందా?

ఎవ్వరినీ పట్టించుకోని దీప్తి సునయన!.. కావాలనే అలా చేసిందా?

    Deepthi Sunaina Shanmukh Jaswanth దీప్తి సునయన శనివారం నాడు బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇలా ఎంతో మంది బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు. అలా షన్ను కోసం అతని అన్న, ప్రియురాలు దీప్తి సునయన వచ్చింది. మొదటగా దీప్తి సునయన రాలేదేమో అని కాస్త హర్ట్ అయ్యాడు షన్ను. అన్నని చూసి బాధ పడ్డాడు. దీప్తి రాలేదేమోనని అనుకున్నాడు.

    కానీ దీప్తి సునయన రావడంతో మనోడి కళ్లలో వెయ్యి వాట్స్‌ల బల్బ్ వెలిగినట్టు అయింది. బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన ప్రతీ ఒక్కరూ అందరు కంటెస్టెంట్లతో మాట్లాడారు. కానీ దీప్తి సునయన మాత్రం షన్నుతో తప్పా మిగతా ఎవ్వరితోనూ మాట్లాడలేదు. ఇక సిరి వైపు అయితే కన్ను ఎత్తి కూడా చూడలేదు. టాప్ 5 పెట్టేప్పుడు కూడా దీప్తి అందరి ఫ్రేమ్స్‌ను అందించింది.

    కానీ ఏ ఒక్కరి గురించి కూడా మాట్లాడలేదు. అంతా షన్ను బ్రదర్ చూసుకున్నాడు. అయితే దీప్తి సునయన కావాలనే అలా అందరినీ అవాయిడ్ చేసిందా? అనే అనుమానం కలుగుతోంది. ఇక షన్ను సిరి రిలేషన్ మీద కూడా దీప్తి కాస్త గుర్రుగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే అటు వైపు చూపు కూడా వేయలేదని తెలుస్తోంది. మొత్తానికి షన్నుకి ఏదో హింట్ ఇచ్చేసినట్టు అనిపిస్తోంది. దాన్ని షన్ను క్యాచ్ చేశాడో లేదో.

    Leave a Reply