Anee Master : కరోనాతో పోరాడుతూ ఉన్నా.. గుర్తు చేసుకున్న ఆనీ మాస్టర్

Anee Master : కరోనాతో పోరాడుతూ ఉన్నా.. గుర్తు చేసుకున్న ఆనీ మాస్టర్

    Anee Master ప్రస్తుతం కరోనా దేశంలో పంజా విసురుతొంది. థర్డ్ వేవ్ ప్రారంభమైందని అందరికీ అర్థమైంది. లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు కూడా బయటపడుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. నైట్ కర్ఫ్యూలు కూడా అమలు చేస్తున్నాయి. దేశంలో ఇప్పుడు మళ్లీ పరిస్థితి చేజారిపోతోన్నట్టు అనిపిస్తోంది.

    మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో కరోనా తాండవం చేస్తోంది. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, నితిన్ భార్య షాలినీ కరోనా బారిన పడ్డారు. అలా మొత్తానికి ఇప్పుడు అందరిలోనూ కరోనా భయం పెరిగింది. అందుకే పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి. తాజాగా కరోనా గురించి జాగ్రత్తలు చెబుతూ ఆనీ మాస్టర్ ఓ పోస్ట్ చేసింది. ఇందులో తాను అనుభవించిన గతాన్ని గుర్తు చేసుకుంది.

    2022లో మొదటి ప్రయాణం అని చెబుతూ.. అందరూ జాగ్రత్తగా ఉండండి.. మాస్కులు ధరించండి.. భౌతిక దూరం పాటించండి అని సలహా ఇచ్చింది. కరోనా అన్ని చోట్లా ఉందని హెచ్చరించింది. గత ఏడాది ఇదే సమయానికి నేను కరోనాతో పోరాడుతూ వచ్చాను. హాస్పిటల్‌లో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నానంటూ నాటి విషయాలను గుర్తు చేసుకుంది.

    అయితే ఆనీ మాస్టర్ ఇప్పుడు ఎక్కడికి బయల్దేరినందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. షూటింగ్ నిమిత్తం అలా బయటకు వెళ్లిందా? అనేది చూడాలి. తన గ్యాంగ్‌తోనే ఆనీ మాస్టర్ కనిపిస్తోంది. అంటే సాంగ్ షూటింగ్ కోసమే ఇలా బయటకు వచ్చిందని అర్థమవుతోంది.

    Leave a Reply