• November 5, 2021

Karthika Deepam Episode 1189 : మొత్తానికి మోసాన్ని తెలుసుకుంది.. బయటకు గెంటేసిన దీప

Karthika Deepam Episode 1189 : మొత్తానికి మోసాన్ని తెలుసుకుంది.. బయటకు గెంటేసిన దీప

    కార్తీకదీపం శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో దీప కళ్లు తెరిచింది. ప్రియమణి చేస్తోన్న మోసాన్ని తెలుసుకుంది.తమ ఇంట్లో మోనిత కోసం పని చేస్తోందని, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడకు చేరవేస్తోందని తెలుసుకుంది. అలా ఈ ఎపిసోడ్‌లో స్థూలంగా జరిగేది అదే. మోసం చేస్తోందని తెలుసుకున్న దీప.. ప్రియమణిని బయటకు గెంటేసింది. అయితే కార్తీకదీపం ఎపిసోడ్ నంబర్ 1189లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    ప్రస్తుతం పరిస్థితులు అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి.. కార్తీక్ ఫ్యామిలీనే నా కాళ్ల దగ్గరకు వస్తుంది అని ప్రియమణితో మోనిత చెప్పుకుంటుంది. అదే సమయంలో సరిగ్గా భారతి కూడా వచ్చింది. సౌందర్య గారు నన్ను పిలిచారు. దోష నివారణ పూజ కోసం నిన్ను రమ్మంటున్నారు. అని భారతి చెబుతుంది. కానీ అదేమీ వినట్టుగా మోనిత నటిస్తుంది. విని కూడా విననట్టు నటిస్తున్నావా? వారి దురదృష్టాన్ని నీ అదృష్టంగా మలుచుకోవాలని చూస్తున్నావా? వాళ్లే రమ్మంటే నువ్ ఇలా చేస్తున్నావా? కొడుక్కి ఏమైనా అవుతుందా? అని సౌందర్య గారు చాలా టెన్షన్ పడుతున్నారు అని భారతిచెబుతుంది.

    ఆమెకేనా కొడుకు? ఆమెనా తల్లినా? నేను కాదా? నాకు బిడ్డ లేడా? నన్ను వాళ్లు ఎంత అవమానించారు.. పని మనిషితో తిట్టించారు.. వారు కనీసం నన్ను మనిషిలా కూడా చూసేవారు కాదు.. పురుగులా చూశారు అంటూ మోనిత గతాన్ని తవ్వేసింది. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే.. కార్తీక్, సౌందర్యల మీద ఓపెన్ అవుతుంది. దోష నివారణ పూజ కోసం కార్తీక్‌ను ఒప్పించేందుకు సౌందర్య కష్టపడుతుంది. తాగింది నిజమే కానీ తప్పు చేశానో లేదో నాకే ఇంకా తెలియడం లేదు.

    ఇప్పుడు చర్చ దాని గురించి కాదు.. పూజ కోసం అంటూ సౌందర్య బతిమాలుతుంది. వస్తాను కానీ దాని పక్కన ఉండను.. పూజ చేస్తాను అన్నది నీ కోసం మాత్రమే అంటూ సౌందర్యతో కార్తీక్ అంటాడు. ఈ పూజ చేస్తే గానీ నాకు మనశ్శాంతి రాదురా అని సౌందర్య అనే సమయంలోనే దీప ఆ మాట వినేస్తుంది. ఏం శాంతి అని అంటున్నారు అని అడిగేస్తుంది. దానికి సౌందర్య ఏదో కవర్ చేసేస్తుంది.పూజ గది క్లీన్ చేస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అని అంటున్నాను అంటూ సౌందర్య అబద్దం చెబుతుంది.

    మీరు చాలా గొప్ప వారు.. అర్దరాత్రి తల్లి కొడుకులు పూజ గది శుభ్రం చేయడం గురించి మాట్లాడుకుంటున్నారు. దీంట్లోనైనా నేను ఉండొచ్చా? మీరే చేసుకుంటారా? అని కౌంటర్లు వేసింది దీప. ఆ తరువాత ప్రియమణి దొంగచాటుగా వెనకాల నుంచి రావడాన్ని దీప చూసింది. ఎక్కడికి వెళ్లావ్.. ఎందుకు ఇలా వెనకాల నుంచి వస్తున్నావ్ అని ప్రియమణిని దీప ప్రశ్నిస్తుంది. ఎలాగూ మోనిత దగ్గరకు వెళ్తాను.. నాకు భయం ఏంటి? నిజం చెబుతాను అని బరితెగించింది ప్రియమణి.

    మోనిత కోసం ఇక్కడకు వచ్చాను అని చెప్పేసింది. దీంతో దీపకు కోపం చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో. డాక్టర్ బాబు, పిల్లలకు తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసు..వెళ్లిపో అంటూ బయటకు గెంటేస్తుంది. మొత్తానికి ప్రియమణి అలా వెళ్లిపోతుంది. అలా సీన్ కట్ చేస్తే.. కార్తీక్‌ను హిమ రమ్మంటుంది. మాట ఇవ్వమని అడుగుతుంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం.. మాట్లాడుకుని చాలా రోజులుంది అయిందని ఎమోషనల్ డైలాగ్ కొట్టేస్తుంది.

    హిమ అడిగితే నేను చేయకుండా ఉంటానా? అని కార్తీక్ అంటాడు మాట ఇస్తాడు. నేను శౌర్యకు ముందే చెప్పాను.. నేను అడిగితే డాడీ ఒప్పుకుంటాడు అని. అందుకే అమ్మను తీసుకు రావడానికి శౌర్య వెళ్లింది అని హిమ అంటుంది. మీ అమ్మ వస్తుంది.. కదా.. నేను వెళ్తాను అని కార్తీక్ అంటాడు.ఎందుకు మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అని హిమ అడుగుతుంది. అదేం లేదు.. మీ అమ్మ అయితే మంచి కథలు చెబుతుంది కదా అని కార్తీక్ అంటాడు. అలా తండ్రీకూతుళ్లు సెంటిమెంట్ సీన్‌తో సీరియల్ ముగుస్తుంది.

    Leave a Reply