• November 4, 2021

Janaki Kalaganaledu : కొత్త పాత్ర ఎంట్రీ.. జానకిపై నిరంతర నిఘా

Janaki Kalaganaledu : కొత్త పాత్ర ఎంట్రీ.. జానకిపై నిరంతర నిఘా

    జానకి కలగనలేదు సీరియల్‌లో ఇప్పుడు జానకి కొత్త పరీక్షను ఎదుర్కునేందుకు సిద్దమైంది. అయితే మొదటి రోజే జానకికి ఎదురుదెబ్బ తగిలింది. ఉదయాన్నే లేచి రెడీ అయింది.. మంచి కోడలు అనిపించుకోవాలని, ఉదయాన్నే లేచి పని చేయాలని అనుకుంది. అనుకున్నట్టుగానే లేచింది. రెడీ అయింది. మరో వైపు రామ ఇంకా ఉదయాన్నే లేచి.. గుడికి వెళ్లి తన భార్య ఈ పందెంలో గెలవాలని పూజ చేసి వచ్చాడు. ఇక జానకి ఇలా ఉంటే.. మల్లిక మాత్రం జానకిని ఓడించేందుకు రెడీ అయింది.

    కానీ మల్లిక ఏమీ చేయకుండానే జానకికి ఎదురుదెబ్బ తగిలింది. జానకి స్నేహితురాలు శ్రావణి వచ్చి నానా పెంట చేసేసింది. జ్ఞానాంబ పరువుతీసేసింది. ఎన్ని మాటలు అనాలో అన్నీ అనేసింది. నోటికొచ్చినట్టు తిట్టేసింది. అవన్నీ వింటూ జ్ఞానాంబ అలానే ఉండిపోయింది. జానకి ఎంత వద్దని వాదిస్తున్నా కూడా శ్రావణి వినిపించుకోలేదు.

    అన్యాయం జరిగింది ఆవిడ కొడుక్కి కాదు.. నీకు.. ఈ చదువు రాని వాడిని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ పాటికి ఏ కలెక్టరో, ఏ డాక్టర్‌నో పెళ్లి చేసుకునే దానివి, విదేశాల్లో మహారాణిలా ఉండేదానివి ఇప్పుడు నీ జీవితం ఇలా అయిపోయింది. ఇది ఆలోచించకుండా.. ఆవిడ తన కొడుకు గురించి ఆలోచిస్తోందని శ్రావణి నానా రకాలుగా అనేసింది. నోర్మూసుకో మాట్లాడకు అంటూ జానకి ఎంత హెచ్చరించినా కూడా శ్రావణి వినిపించుకోలేదు.

    మా అత్తగారి గురించి తెలియకుండా అలా మాట్లాడొద్దు.. కూతురిలా నాకు ప్రేమను పంచుతుంది. మా అమ్మ లేదనే లోటు తెలియకుండా నన్ను చూసుకంటుంది.. మీకు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు.. నన్ను నేను నిరూపించుకునేందుకు ఒక అవకాశాన్ని కూడా ఇచ్చారు అని జానకీ చెబుతుంది.అయినా ఆమె ఫ్రెండ్స్ వినిపించుకోరు. జ్ఞానాంబను మాటలు అంటూనే ఉన్నారు

    పేరుకే జ్ఞానాంబ కానీ అంటూ శ్రావణి ఏదో అనబోయింది. ఇక జానకి తన ఫ్రెండ్స్‌ను పక్కకు లాక్కెళ్లింది. వెళ్లిపోమ్మని హెచ్చరించింది. తన ఫ్రెండ్స్ తరుపున తాను క్షమాపణలు చెబుతున్నారు. వాళ్లు తెలియక మాట్లాడారు క్షమించండి అత్తయ్య గారు అని జానకి కోరింది. వారు మాట్లాడలేదు.. నువ్వే మాట్లాడించావ్ అని జ్ఞానాంబ అంటుంది. అయ్యో అత్తయ్య గారు నేను ఎందుకు అలా చేస్తాను.. మీరు తప్పుగా అనుకుంటున్నారు అని జానకి కన్నీరు పెట్టేసుకుంది అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    ఇక రేపటి ఎపిసోడ్‌లో.. శ్రావణి చెప్పిన దాంట్లో ఓ నిజం ఉందండి.. మీరు నన్ను పెళ్లి చేసుకోక పోతే.. ఈపాటికి ఏ డాక్టరో, ఇంజనీరో, కలెక్టర్నో పెళ్లి చేసుకుని ఎంతో దర్జాగా ఉండే వారు అని జానకితో రామచంద్ర అంటాడు. జానకి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి.. ఎలా తీసుకోవాలి అని భర్త గోవింద రాజులుతో జ్ఞానాంబ అంటుంది. దీనికి తన అమ్మ మైరావతిని పిలుద్దామనే సలహా ఇస్తాడు గోవింద రాజులు. ఈ 15 రోజులు మా అమ్మ జానకిని పరీక్షిస్తుంది. కంటకనిపెడుతుంది. ఆమె నిర్ణయం తీసుకుంటుంది అని అంటాడు. మరి మున్ముందు ఈ కథ ఇంకెలా మలుపులు తిరుగుతుందో చూడాలి.

    Leave a Reply