• November 15, 2021

Evaru Meelo Koteeswarulu : కోటి రూపాయలు గెలుచుకున్న ఎస్సై.. ఆ ప్రశ్నపై అందరి చూపు

Evaru Meelo Koteeswarulu : కోటి రూపాయలు గెలుచుకున్న ఎస్సై.. ఆ ప్రశ్నపై అందరి చూపు

    ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో అట్టర్ ఫ్లాప్ అయిందన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఎంత ప్రయత్నించినా ఆ షో పైకి లేవడం లేదు. అసలు జెమినీ టీవీనే అథమస్థాయిలో ఉంది. అందులో వచ్చే షోలను లేపడం ఎవ్వరి తరం కాదు. అలాంటి ఎన్టీఆర్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో రేటింగ్స్ చూస్తే నవ్వు ఆగదు. రెండు మూడు పాయింట్లోలోనే కొట్టు మిట్టాడుతోంది. అలాంటిది ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో హాట్ టాపిక్ అయింది.

    ఎందుకంటే ఆ షోలో ఇప్పటి వరకు కోటి రూపాయల ప్రశ్నను చాలా మంది చూడకుండానే వెనుదిరిగి వెళ్లారు.అక్కడి వరకు ఒకరిద్దరు వచ్చినా కూడా కోటీ రూపాయలను తీసుకోకుండానే వెళ్లారు. దాదాపు చాలా మంది యాభై లక్షల వద్దే ఆగిపోయారు. అయితే తాజాగా ఓ చరిత్ర క్రియేట్ అయింది. మొదటిసారిగా తెలుగు బుల్లితెరపై ఇంతటి ప్రైజ్ మనీని ఇచ్చిన, సొంతం చేసుకున్న వారు లేరు. అలా మొత్తానికి కోటీ రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పారు. కోటీ సొంతం చేసుకున్నాడు.

    భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చిన ఎస్సై బీ రాజా రవీంద్ర కొత్త చరిత్రను సృష్టించాడు. కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పి నయా హిస్టరీని లిఖించాడు. మొత్తానికి కోటీ రూపాయలు గెలుచుకున్నాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటి? దాని సమాధానం ఏంటి? అని తెగ ఆలోచిస్తున్నారు. ఆ విషయం తెలియాలంటే నేటి రాత్రి వరకు ఆగాల్సిందే. నేడు ప్రసారం కాబోతోన్న ఎపిసోడ్‌లోనే రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకోబోతోన్నారు.

    Leave a Reply