• December 8, 2021

ఒక తల్లికి ఇద్దరు తండ్రులు!.. సినీ పరిశ్రమ, ప్రభుత్వ తీరుపై నిర్మాత సీ కళ్యాణ్

ఒక తల్లికి ఇద్దరు తండ్రులు!.. సినీ పరిశ్రమ, ప్రభుత్వ తీరుపై నిర్మాత సీ కళ్యాణ్

    ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. ఆయన ఏం మాట్లాడినా కూడా ముక్కుసూటిగా ఉంటుంది. బాలయ్యకు అతి దగ్గరగా ఉండే సన్నిహితుడు. తాజాగా సినీ పరిశ్రమపై ప్రభుత్వాల తీరుపై, సినీ పరిశ్రమలో ఏర్పడ్డ మార్పులపై మాట్లాడారు. ఆయన పుట్టిన రోజు (నవంబర్ 9) సందర్బంగా మీడియాతో ముచ్చటించాడు.

    ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడి సినిమా కావాలని అఖండ నిరూపించింది. సినిమా అనేది చిన్న పరిశ్రమే కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ప్రజలకు ఏదో మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం అనుకోవచ్చు. కానీ నా వస్తువు నేను తయారు చేసుకుని, నా వస్తువు రేటు నేను ఫిక్స్ చేసుకుంటాను. ఆ వస్తువును కొనాలా? వద్దా? సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. కానీ మరీ ఇంతగా తగ్గించడం మాత్రం విచారించాల్సిన విషయం. ఏదేమైనా ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.

    ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవ్వరూ సంతోషంగా లేరు. మిర్యాల రవీందర్ రెడ్డి కాబట్టి రిలీజ్ చేయగలిగారు. అంతంత పర్సంటేజీలు తగ్గించుకుని రిలీజ్ చేశారు. ఈ రేట్ల మీద ఎంజీలు వేసుకోలేకపోతోన్నారు. అదనపు షోలు లేవు. బాలయ్య బాబు తన స్టామినా మీద కొట్టుకుని వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేశారంటే నిర్మాతకు హ్యాట్సాఫ్.

    ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని మేమే అడిగాం. పారదర్శకత కోసం మేం అడిగాం. కానీ దాన్ని చిలవలుపలవలుగా చేశారు. కానీ మీడియా మాత్రం వక్రీకరించింది. అసలు విషయం తెలుసుకుని వార్తలు రాసేవారి కన్నా.. కొత్తగా క్రియేట్ చేసి రాసేవారు ఎక్కువయ్యారు. అందుకే ఇలా ఇగోలు హర్ట్ అయి ఇంత వరకు వచ్చిందని అనుకుంటున్నాను. అదనపు షోలు, మిడ్ నైట్ షోలను ప్రభుత్వమే అలవాటు చేసింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం వేస్ట్. మనకు కావాల్సింది పరిశ్రమకు మంచి జరగడం.

    ఇప్పుడు సినిమాలు తీసేవారికి చిన్న సినిమా ఏదో పెద్ద సినిమా ఏదో కూడా తెలియదు. చిన్న సినిమా అంటే మంచి సినిమా తీయమని. శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా మొదటగా మూడు థియేటర్లోనే విడుదలైంది. సినిమాలో స్టామినా ఉంటే ఇవన్నీ నథింగ్. ప్రభుత్వం మీద కామెంట్లు చేయడం కూడా అనవసరం. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్లు కాదు. ఇంతకు ముందు సినిమా వాళ్లంతా మనవాళ్లే. కానీ ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్‌లోకి రావడం, ఆ తరువాత సినిమా వాళ్లు కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో గ్రూపులు మొదలయ్యాయి.

    చిరంజీవి సినిమా విడుదల విషయంలో ఓ సారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా టికెట్ రేట్లను తగ్గించారు. అయితే మేం వెళ్లి ఆయన్ను రిక్వెస్ట్ చేశాం. అప్పుడు ఎండీసీ చైర్మన్‌గా రమణాచారి గారున్నారు. టికెట్ రేట్లు తగ్గించకండి.. మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. కానీ అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఇలా అన్నారు. ‘రమణ.. చెడ్డ పేరు వస్తే నాకే కదా? వాళ్లకు ఏదో ఇబ్బంది వస్తుందట కదా?.. చేసి పెట్టు’ అని అన్నారట.

    ప్రస్తుతం సినీ పరిశ్రమ ఒక తల్లికి ఇద్దరు తండ్రుల్లా మారింది. ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు.. మరో తండ్రి అక్కడ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ముందుగా ఈ తండ్రి వద్దకే వెళ్తున్నాం. సినిమా వాళ్లదంతా ఏ రోజు హడావిడి ఆరోజుదే. ఇద్దరు సీఎంలను ఒకే చోటకు తీసుకొచ్చి సత్కరిద్దామని అనుకున్నాం. కానీ అది కుదర్లేదు. ముందుకు నడిపించే వ్యక్తి లేకుండాపోయారు.

    పరిశ్రమ మీద ఎలాంటి రూల్స్ తెచ్చినా సినిమా వాడు ఎవ్వడూ ముందుకు రారు. ఈ రోజు 39 డీ అనే కొత్త సెక్షన్ రాబోతోంది. అందరూ కలిసి రండి పోరాడుదామంటే ఎవ్వరూ రావడం లేదు. ఎవ్వరి డబ్బులు వారికి వచ్చేస్తున్నాయ్.. ఎటొచ్చి నిర్మాతలకే కదా? నష్టం. కష్టం వచ్చినప్పుడే దాసరి గారు లేని లోటు తెలుస్తోందని అంటున్నారు.

    ఒకప్పుడు నిర్మాతలు ఇలా ఉండేవారు కాదు. హిట్ అయిన దర్శకులనే రమ్మని పట్టుకుని రమ్మనే వారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం హిట్ కాంబినేషన్‌కే డిమాండ్ ఉంది. నేను 30 ఇస్తాను అని అంటే.. ఇంకొకడు 35 ఇస్తాను అని వస్తున్నాడు. పెద్ద డైరెక్టర్‌ను పట్టుకుని వస్తానని అంటున్నాడు. ఇప్పుడంతా ఫిగర్స్ గేమ్.

    ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న నిర్మాతలో ఏ ఒక్కరికి కూడా ఒక రోజు ప్రొడక్షన్ ఖర్చు ఎంత అయిందో కూడా తెలీదు. కానీ నేను మాత్రం తీసిన కంటెంట్‌ను బట్టి చెబుతాను. అందులో ఎంత వేస్ట్ ఉంది.. ఎంత ఖర్చు వృథాగా వెళ్లిందో నేను చెప్పగలను. ఇప్పుడు పద్దతి మారిపోయింది. మేనేజర్ల సెటప్ వచ్చేసింది.

    గాడ్సే షూటింగ్‌ నేటితో పూర్తవుతుంది. వారంలో టీజర్, రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ వస్తుంది. ఇది పీరియాడిక్ డ్రామా. సినిమా సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. నా ప్రొడక్షన్‌లో ఇంత ఆలస్యమైన సినిమా ఇదే. సయోధ్యల కోసం చాలానే ట్రై చేశాను.

    రూలర్ సినిమా అయ్యాకే బాలయ్య బాబుతో చేయాలి. కానీ అంతలోపే సొంత ప్రొడక్షన్ కంపెనీలో అనిల్ రావిపూడి సినిమాను ఓకే చేశారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాను కూడా రెడీ చేశారు. ఈ మూడు కమిట్మెంట్లు ఉన్నాయి. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తీయాలని ఉంది. శంకరాచర్య సినిమాను బాలయ్యతో తీయాలని ఉంది. ఆయనకు కూడా చేయాలని ఉంది. మేం ఆయన్ను అలా చూడాలని అనుకుంటున్నాం. బాలయ్య గారు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నన్ను ఆయన సొంత మనిషిలా భావిస్తాను.. సొంత ప్రొడక్షన్‌లానే అనుకుంటారు. ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడే సినిమాను తీస్తాను.

    గాడ్సే సినిమాను జనవరి 26న ప్లాన్ చేస్తున్నాం. మళ్లీ అదే దర్శకుడు గోపీ గణేష్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక నా హీరో సత్యదేవ్‌తోనూ ఇంకో సినిమా చేస్తాను. గాడ్సే తరువాత సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సినిమాను చూశాను. ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొపే చిత్రం. ఇందులో అందరి సమస్యలు చూపిస్తాం. అమ్మనాన్నలు కష్టపడి చదివిస్తే.. చదువుకుని ఏదో చేద్దామని అనుకుని ఏం చేయకుండా స్ట్రగుల్ అయ్యే ప్రతీ ఒక్కడి సమస్య. ప్రభుత్వాలు ఎలా ఆడుకుంటున్నాయ్.. నిరుద్యోగం ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే పాయింట్ మీద వస్తుంది. దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడో.. హీరో అద్భుతంగా చేశాడు. మంచి పేరు వస్తుంది. గాడ్సే కారెక్టర్ వింతగా ఉంటుంది.

    తమిళ నాడు నాకు ఓ మంచి బహుమతి ఇచ్చింది. ఆ గిఫ్ట్ మీ అందరితో పంచుకుంటాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన కళ్యాణ్ ఏం చేయబోతోన్నాడో చూపిస్తాను.

    Leave a Reply