ప్రణయ గోదారి రివ్యూ.. వింటేజ్ విలేజ్ డ్రామా

ప్రణయ గోదారి రివ్యూ.. వింటేజ్ విలేజ్ డ్రామా

    ప్రణయగోదారి విలేజ్ డ్రామాగా శుక్రవారం నాడు థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రంలో సదన్, ప్రియాంక ప్రసాద్, సాయి కుమార్, పృద్వీ, జబర్దస్త్ రాజమౌళి, సునీల్ రవినూతల, ప్రభావతి, మిర్చి మాధవి, ఉషస్రే వంటి వారు నటించారు. పిఎల్ విఘ్నేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. పిఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్‌పై మార్కండేయ సంగీత దర్శకుడిగా లింగయ్య పరమళ్ల నిర్మించారు. ఈ ప్రణయగోదావరి ఎలా ఉందో ఓ సారి చూద్దాం..

    కథ
    పెద కాపు (సాయి కుమార్) ఊరి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. దత్తుడు (30 ఇయర్స్ పృథ్వీ) అనే వ్యక్తి ప్రతీసారి పెదకాపుతో పోటీ పడుతూ ఉంటాడు. శీను (సదన్) పెద కాపు గ్రామానికి వచ్చి గొయ్య (ప్రియాంక ప్రసాద్)తో ప్రేమలో పడతాడు. వారి ప్రేమ మొదలవ్వడంతో పరిస్థితులు తారుమారు అవుతాయి. వీరిద్దరూ అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఊరి పెద కాపు ఈ ప్రేమజంట శీను, గొయ్యలను కాపాడాడా? వీరిద్దరూ ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నారు? చివరకు ఈ జంట ఒక్కటైందా? లేదా? అన్నది చూడాల్సిందే.

    నటీనటులు
    డైలాగ్ కింగ్ సాయి కుమార్ సినిమా అంతటా హై ఆక్టేన్ యాక్షన్‌తో అదరగొట్టేశారు. ఎమోషన్స్‌తో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ డామినేట్ చేశాడు. అసలే సాయి కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న సంగతి తెలిసిందే. డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటన అత్యద్భుతంగా ఉంది. అతని పెద కాపు పాత్ర సినిమాకు పెద్ద ఎసెట్. హీరో సదన్ లీడ్ రోల్‌లో డీసెంట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ తన తొలి సినిమా అయినప్పటికీ సినిమా చివరి వరకు మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆర్టిస్ట్ సునీల్ రావినూతల గోచి క్యారెక్టర్‌లో మంచి పాత్రతో ప్రేక్షకులను అలరించారు. 30 ఇయర్స్ పృథ్వీ మెప్పిస్తుంది.

    విశ్లేషణ
    ప్రణయగోదారి చిత్రంలో మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషనల్‌గా ఆడియెన్స్‌ను కనెక్ట్ చేయడంతో దర్శకుడు సక్సెస్ అవుతాడు. కథ నుంచి ఎటువంటి డైవర్షన్స్ లేకుండా ప్రేక్షకులకు అందించడంలో దర్శకుడు తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. సినిమాలో ఏ పాత్రలు కూడా వృథాగా పెట్టాడని అనిపించదు. తెరపై ప్రదర్శించబడే ప్రతి పాత్రకు మంచి ముగింపు ఇచ్చాడు.

    దర్శకుడు పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం అభినందనీయం. ప్రతి ఫ్రేమ్ మరియు ఎగ్జిక్యూషన్ మంచి స్క్రీన్ ప్లేతో చక్కగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదసరదాగా సాగి.. ప్రేమ, కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఇక ద్వితీయార్థం ఎమోషనల్ రైడ్‌గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ టచ్ చేస్తుంది. క్లైమాక్స్ కాస్త ఊహకు అందేలానే సాగుతుంది.

    విజువల్స్‌ అద్భుతంగా అనిపిస్తాయి. డిఓపి ప్రసాద్ విజువల్స్ క్యాప్చర్ చేయడంలో అద్భుతంగా పనిచేశారు. సంగీత దర్శకుడు మార్కెండేయ అందించిన బీజీఎం, ఆర్‌ఆర్‌, సంగీతం ఆకట్టుకున్నాయి. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కళాధర్ కొరియోగ్రఫీ బాగానే ఉంది. మాటలు, పాటలు బాగుంటాయి. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది.

    వింటేజ్ విలేజ్ డ్రామా

    రేటింగ్ 3