• January 1, 2024

ఇండోనేషియన్ ప్రాజెక్టులో సత్తా చాటబోతోన్న తెలుగు హీరో విశ్వ కార్తికేయ

ఇండోనేషియన్ ప్రాజెక్టులో సత్తా చాటబోతోన్న తెలుగు హీరో విశ్వ కార్తికేయ

    [7:06 AM, 1/1/2024] Chinna 💕❤️: లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై శివ కంఠమనేని హీరోగా రూపొందుతోన్న ‘రాఘవ రెడ్డి’ చిత్రం నుంచి ఐటెమ్ సాంగ్ ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ రిలీజ్

    ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అంటూ అమ్మడు పాడే పాటకి కుర్రకారు అంతా మైమరచిపోతున్నారు. ఇంతకీ టెన్త్ క్లాస్ చదివి డాక్టర్ అయిన అమ్మాయెవరో తెలుసుకోవాలంటే మాత్రం ‘రాఘవ రెడ్డి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్, R.వెంకటేశ్వర్ రావు, G.రాంబాబు యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    ‘రాఘవరెడ్డి’ మూవీ జనవరి 5న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం ‘రాఘువ రెడ్డి’ నుంచి ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అనే ఐటెమ్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు సుధాకర్ మారియో సంగీతాన్ని అందించారు. సాగర్ నారాయణ్ సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ సింగర్ మంగ్లీ ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా..

    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ‘లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. శివ కంఠమనేనిగారిని కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన ఈ సినిమాను జనవరి 5న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మంగ్లీగారు పాడిన ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ సాంగ్ విడుదల చేశాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
    [7:16 AM, 1/1/2024] Chinna 💕❤️: ఇండోనేషియన్ ప్రాజెక్టులో సత్తా చాటబోతోన్న తెలుగు హీరో విశ్వ కార్తికేయ

    ప్రస్తుతం మన టాలీవుడ్ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో రెపరెపలాడుతోంది. హాలీవుడ్ మేకర్లు సైతం టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. మన హీరోలు, దర్శకుల పని తనం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి తరుణంలో మన హీరో ఓ ఇండోనేషియన్ ప్రాజెక్టులో నటించబోతున్నారు. టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా దూసుకుపోతోన్న విశ్వ కార్తికేయ, కలియుగం పట్టణంలో సినిమాతో హిరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఆయుషీ పటేల్ హీరో హీరోయిన్లు గా ఇండోనేషియన్ ప్రాజెక్టులో నటిస్తున్నారు.

    టాలీవుడ్‌లో దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా విశ్వ కార్తికేయ నటించారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది సినిమాల్లో విశ్వ కనిపించాడు. రాజ శేఖర్ గోరింటాకు, రోహిత్ జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, శ్రీకాంత్ లేత మనసులు, మోహన్ బాబు శివ శంకర్, బాలయ్య బాబు అధినాయకుడు వంటి సినిమాల్లో విశ్వ నటించాడు.

    జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో మంచి నటనను కనబరిచిన విశ్వ కార్తికేయ ప్రస్తుతం కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయకు జోడిగా ఆయుషి పటేల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే ఇండోనేషియన్ ప్రాజెక్ట్‌లో వీరు ఇద్దరు ఆఫర్ పట్టేశారు.

    ‘శూన్యం చాప్టర్ 1’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి దర్శక, నిర్మాణ బాధ్యతలను సీకే గౌస్ మోదిన్ నిర్వర్తిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ సినిమా రానుంది. ఇక ఈ ఇండోనేషియన్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది.