• January 13, 2022

మంచితనానికి, మర్యాద ఇవ్వడంలో ఆ ఫ్యామిలీని మించిన వాళ్లు లేరు : దర్శకేంద్రుడు

మంచితనానికి, మర్యాద ఇవ్వడంలో ఆ ఫ్యామిలీని మించిన వాళ్లు లేరు : దర్శకేంద్రుడు

    సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

    దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ‘సినిమా చూడకుండా మాట్లాడాలంటే మాటలను కాస్త పోగు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మూవీ టీజర్‌ను ఆదిత్య చూపించారు. మైక్రోసాఫ్ట్, యాపిల్ కలిసి ఓ ప్రొడక్ట్ చేసినా అంబానీ, టాటా కలిసి చేస్తే ఎలా ఉంటుందో.. సినిమా ఫీల్డ్‌లో నెంబర్ వన్‌గా సూపర్ స్టార్ ఫ్యామిలీ, రాజకీయం, బిజినెస్‌లో నెంబర్ వన్‌గా ఉన్న గల్లా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రొడక్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

    హీరో అవ్వాలని ఉందంటూ అశోక్ చిన్నతనం నుంచి నాతో అనేవాడు. ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. మంచితనానికి, మర్యాదకు కృష్ణ ఫ్యామిలీ కంటే మించిన వాళ్లు లేరు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. అలా నీకు ఈ ఇండస్ట్రీ గేట్లు తెరచుకున్నాయి. నిధి అగర్వాల్ యాక్షన్‌తో పాటు గ్లామరస్‌గా ఉంటుంది. మహేష్ బాబును నేను యువరాజుగా ఇంట్రడ్యూస్ చేశాను. ఈ టీజర్ చూస్తే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. మహేష్‌లా అలా ముందుకు వెళ్తూనే ఉంటాడు. హార్స్ స్పీడ్, బ్యాటర్ పవర్‌తో కలిసి ముందుకు వెళ్లాలి ’అని అన్నారు.

    Leave a Reply