• October 29, 2021

Janaki Kalaganaledu Episode 160 : ఆ మాటలకు కంటతడి.. గుండెలో భారాన్ని మోస్తోన్న జ్ఞానాంబ

Janaki Kalaganaledu Episode 160 : ఆ మాటలకు కంటతడి.. గుండెలో భారాన్ని మోస్తోన్న జ్ఞానాంబ

    జానకీ కలగనలేదు సీరియల్ ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. జానకి చదువుకున్న విషయం మొత్తానికి జ్ఞానాంబకు తెలిసింది. తన తమ్ముడి పరిస్థితే తన కొడుక్కి కూడా వస్తుందేమో అని జ్ఞానాంబ దిగులు చెందుతోంది. తన కొడుక్కంటే తక్కువ చదువుకున్న దాన్నే కోడలిగా తెచ్చుకుంటాను అని ఊర్లో శపథం చేసిన జ్ఞానాంబకు ఎదురుదెబ్బ తగిలింది. తన కోడలు చదివింది ఐదో తరగతి కాదని, డిగ్రీ వరకు చదివిందని తెలియడంతో ఊర్లో వాళ్ల ముందు తలదించుకోవాల్సి వస్తుందని జ్ఞానాంబ భయపడుతోంది.

    ఇక నేటి ఎపిసోడ్ అంటే అక్టోబర్ 29న ప్రసారం కానున్న Janaki Kalaganaledu Episode 160లో ఏం జరిగిందంటే.. నీలావతి వచ్చి తన పని ఏదో తాను చూసుకుని వెళ్లకుండా మంట పెట్టేసింది. నీలావతికి తోడుగా మల్లిక అగ్గికి ఆజ్యం పోసింది. నీలావతి అనక ముందే.. మల్లిక కొన్ని మాటలు అనేసింది. అంటే జానకిని ఇంట్లోంచి బయటకు పంపించాలని అంటున్నారా? మా బావగారి జీవితంలోంచి జానకిని వెళ్లిపోమ్మనంటున్నారా? అంటూ మల్లిక మొసలి కన్నీరు కార్చింది.

    మల్లిక నాటకాలు తెలిసిన మామ గోవింద రాజులు ఆమె నోర్మూయించాడు. నీ కుళ్లు అంతా కూడా బయటపెట్టకు అంటూ వాయించాడు. నాకు కుళ్లు ఎందుకు ఉంటుంది మామ గారు.. గంగాళమంత ప్రేమ ఉంది అంటూ నాటకాలు ఆడింది.నీ నాటకాలు నాకు తెలియదా? జానకీ అంటే నీకు ఎంత కుళ్లో నాకు తెలియదా? అన్నాడు. ఇక నీలావతి నోరు మూయించేందుకు కూడా ప్రయత్నించాడు.

    కానీ నీలావతి వెళ్తూ వెళ్లూ మంటరాజేసిపోయింది. పదిహేను రోజుల్లో నీ కొడుక్కు అనుకున్నట్టుగానే పెళ్లి చేశావ్? అంతే త్వరగా ఈ పెళ్లి పెటాకులు చేయగలవా? నీ కోడలిని ఇంట్లోంచి పంపించేస్తావా? అని సూటి పోటి మాటలతో బాధపెట్టింది. ఇది నా ఇంటి సమస్య నీకు అనవసరం అంటూ జ్ఞానాంబ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అందరూ ఇదే మాట అంటే ఏం సమాధానం చెబుతావో చూస్తాను.. పరువు పరువు అన్నావ్. అదే ఇప్పుడు పోయింది అంటూ నీలావతి వెళ్లిపోయింది.

    ఆ మాటలు విన్న జ్ఞానాంబ బాధపడింది. ఆమె బాధను చూసి రామ, జానకిలు ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరి మధ్య పెరిగిన దూరాన్ని ఇంకా పెంచేస్తా.. అంటూ మల్లిక తెగ సంబరపడిపోయింది. ఇక కట్ చేస్తే స్వీట్ షాపు వద్ద రామా పరధ్యానంగా ఉంటారు. కస్టమర్ వచ్చి ఆర్డర్ ఇచ్చినా కూడా వినడు. చివరకు రజినీ బుడ్డోడు వచ్చి డబ్బులు తీసుకుంటాడు. కానీ ఆర్డర్ విషయం మాత్రం రామ పట్టించుకోలేదు.

    రాత్రి పూట రామ, జానకీలు మాట్లాడుకోవడం జ్ఞానాంబ వింటుంది. అమ్మ నాకే కాదు.. తనకు కూడా శిక్ష వేసుకుంది.. రామ అంటూ పిలవకుండా క్షణం కూడా ఉండలేదు.. ఏం చేస్తే అమ్మ బాధపోగొట్టగలను అంటూ రామ ఎమోషనల్ అయ్యాడు. నేను దురదృష్ణవంతురాలిని అని మరోసారి రుజువైంది. అమ్మానాన్నలు చనిపోయారు.. అన్నా వదినలు ఎక్కడో ఉన్నారు. వారు ఉన్నా లేనట్టే. ఇక నేను ఇక్కడికి వచ్చి.. తల్లీకొడుకుల మధ్య దూరం పెంచాను నిజంగానే నేను దురదృష్టవంతురాలిని అని జానకి ఏడ్చేసింది.

    మీరు నా జీవితంలోకి రావడం నా అదృష్ణం. మీరు రావడంతోనే అంతా మారిపోయింది. మట్టి ముద్దలా ఉన్న నేను ఇలా మారిపోయాను.. మన ఇళ్లు కూడా ఎంతో మారింది. ఈ విషయం అమ్మకు కూడా తెలుసు. కానీ మీరు ఎక్కువగా చదువుకోవడం వల్ల భవిష్యత్తులో నన్ను ఎక్కడ మీరు అవమానిస్తారో అని అమ్మ భయపడుతోంది. అన్నయ్య కోసం అన్నీ వదులుకున్న మీకు.. నన్ను ఎందుకు అలా చేస్తారు.. అదొక్కటి చాలు మీకు అహంకారం లేదు అని చెప్పడానికి. కానీ అమ్మ భయాన్ని ఎలా పోగొట్టాలి అంటూ రామ బాధపడ్డాడు. ఈ ఇద్దరి మాటలు విన్న జ్ఞానాంబ గుండె బరువెక్కింది. కంటతడి పెట్టేసుకుంది.

    కన్నబాబు షాపుకు వచ్చి రామతో కావాలనే గొడవపడతాడు. ఏదో పరధ్యానంలో ఉన్నాను క్షమించమని కన్నబాబును రామ అడుగుతాడు. ఇక అలా సీరియల్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో మల్లిక వంటగదిలో ఉండటం, జానకీ రావడం, జానకితో మల్లిక పిచ్చి పిచ్చిగా మాట్లాడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఉదయం పూట ఇలాంటి అశుభాలు ఎందుకు పలుకుతున్నావ్.. నీ బుద్ది గానీ జ్ఞానం గానీ లేవా? అంటూ మల్లిక మీద జానకి అరుస్తుంది. అదంతా కూడా జ్ఞానాంబ వింటుంది. మరి ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

    Leave a Reply