- July 10, 2024
పాన్ ఇండియా ఫిల్మ్తో ఈశ్వర్ ప్రసాద్

ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్పై దొమ్మరాజు హేమలత, ఉదయ కుమార్ నిర్మించిన 4లెటర్స్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన ఈశ్వర్ ప్రసాద్ మరో పాన్ ఇండియా ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమిళ్ లో రెండు ప్రాజెక్ట్స్ తో బూజిగా ఉన్న ఈశ్వర్ ప్రసాద్ తిరుపతి వాస్తవ్యుడు. అమెరికాలో ఉంటున్న ఈశ్వర్ …సినిమాల మీద ఫ్యాషన్ తో ఫిల్మీ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చి 4లెటర్స్ సినిమా తో హీరో గా పరిచయం అయ్యారు. ఆ సినిమా లో తన పెర్ఫార్మెన్స్ తో మంచి గుర్తింపు పొందారు. అంతేకాక మెరిట్ విద్యార్థులకు ఫీజులు పే చేస్తూ, సామాజిక సేవ కార్యక్రమాల్లో తన వంతు పాత్రపోషిస్తున్నారు. జూలై 11 తన బర్త్ డే సందర్భంగా తెలుగు లో పీకాక్ ఇండియన్ సినిమా బ్యానర్ లో ఓ పాన్ ఇండియా సినిమా ను స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు ఈశ్వర్ ప్రసాద్.