- October 19, 2021
‘సుఖీభవ’ కుర్రాడిపై దాడిలో ట్విస్ట్.. అయ్యయ్యో ఇకపై వద్దమ్మా!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారు..ఎందుకు ఫేమస్ అవుతారో కూడా తెలియదు. ఎవరి టైం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కానీ తాజాగా ఓ కుర్రాడు మాత్రం బాగానే ఫేమస్ అయ్యాడు. తెలంగాణలో డీజే పెడితే బరాత్ డ్యాన్స్లు చేస్తే మోత మోగాల్సిందే.అలా ఓ కుర్రాడు బరాత్లో డీజే పెట్టేసి ఓ యాడ్ను రీమిక్స్ చేశాడు. అయ్యయ్యో వద్దమ్మ.. సుఖీభవ సుఖీభవ అంటూ శరత్ అనే కుర్రాడు బాగానే ఫేమస్ అయ్యాడు. ఓవర్ నైట్ స్టార్ అయి.. సోషల్ మీడియాలో మీమర్స్, ట్రోలర్స్కు మంచి ఆయుదంగా మారాడు.
లెక్కలేనన్ని మీమ్స్ పుట్టుకొచ్చాయి. అయితే నిన్న రాత్రి ఆ కుర్రాడి మీద దాడి జరిగింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది. ఆ దాడిచేసింది హిజ్రాలు అని, తమ గురించి వచ్చిన ప్రకటనను అలా కించపరిచాడు అంటూ హిజ్రాలు దాడి చేసి ఉంటారనే ఆరోపణలు వచ్చాయి. కానీ అసలు కథ వేరే ఉందట. ఆ కుర్రాడు శరత్ మీడియాతో మాట్లాడుతూ అసలు సంగతి తెలిసిందే.
అదో గ్యాంగ్ వార్ అని.. అంతకు ముందు ఒకరిని శరత్ అండ్ కో కొట్టారట. తమకు వరుసకు సోదరి అయిన అమ్మాయిని ఓ ఆకతాయి ఏడిపిస్తున్నాడని శరత్ అండ్ గ్యాంగ్ అతగాడిని చితకబాదారట. ఆ కేసులో శరత్ జైలుకు కూడా వెళ్లాడట. ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతున్నాడట. ఆ గొడవల వల్లే ఇప్పుడు తన మీద ఇలా దాడి చేశారంటూ అసలు కథ చెప్పేశాడు. ఇక తాను ఇలా ఫేమస్ అవ్వడం కూడా వారు జీర్ణించుకోలేక ఇలా చేసి ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇకపైనా అయిన ఇలాంటి దాడులు ఆపేస్తారేమో చూడాలి. శరత్ స్టైల్లో చెప్పాలంటే.. అయ్యయ్యో ఇకపై దాడులు వద్దమ్మా అని అనాల్సిందే.