- November 14, 2021
జబర్దస్త్కు సుడిగాలి సుధీర్ గుడ్ బై!.. అసలు జరిగింది ఏంటంటే?
జబర్దస్త్ షో అంటే ఒకప్పుడు అనసూయ, రోజా, నాగబాబు అనుకునే వారు. ఆ తరువాత రష్మీ వచ్చింది లైమ్ లైట్లోకి. సుడిగాలి సుధీర్ కింది నుంచి ఎదిగాడు. జబర్దస్త్ షోకు ఆయువుపట్టుగా మారిపోయాడు. అలాంటి సుధీర్ లేని జబర్దస్త్ షోను ఎవ్వరూ దేకరు. అసలు జబర్దస్త్ షోను టీవీలో చూడటమే మానేశారు చాలా మంది. సుధీర్ స్కిట్లు, ఆది స్కిట్లు అంటూ యూట్యూబ్లో వెతుక్కుని చూస్తున్నారు. అంతే గానీ అదే పనిగా పెట్టుకుని టీవీల్లో ఎవ్వరూ చూడటం లేదు.
అలాంటి సుధీర్ జబర్దస్త్ను వీడితే ఇక ఆ షో పరిస్థితి కూడా అంచనా వేయలేం. సుధీర్ బయటకు వెళ్తే ఆయనతో పాటుగా గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కూడా వెళ్తారేమో. ఎందుకంటే ఈముగ్గురు కూడా బయటి ప్రాజెక్ట్లతో బాగా బిజీగా ఉన్నారు. హీరోలు ట్రై చేస్తున్నారు. ఎవరికి వారు హీరోలు నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజు యాదవ్, కాలింగ్ సహస్ర ఇలా ఏవేవో సినిమాలతో గెటప్ శ్రీను, సుధీర్ బిజీగా మారిపోయారు.
అయితే రెండు మూడు రోజుల నుంచి సుధీర్ మీద ఓ రూమర్ వస్తోంది. జబర్దస్త్ షో నుంచి సుధీర్ బయటకు వచ్చేశాడట అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు జరిగింది ఏంటంటే.. ప్రతీ యేటా.. ఆర్టిస్టులతో ఎగ్రిమెంట్లు చేయించుకుంటుంది మల్లెమాల. మల్లెమాల అగ్రిమెంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అవినాష్ వల్ల అగ్రిమెంట్ వ్యవహారం అంతా కూడాపెంటగా మారిపోయింది.. అయితే ఈ యేడాది కొత్తగా ఎగ్రిమెంట్లపై సంతకాలు చేయడానికి సుడిగాలి సుధీర్ అంగీకరించలేదట.
సినిమాలతో బిజీగా ఉండటం మూలాన అలా అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టలేనని చెప్పేశాడట. అయితే అంత మాత్రన జబర్దస్త్ షోను వీడతాడా? అనేది మాత్రం చెప్పలేం. అలా అని సుధీర్ను అడ్డుకుని ఇబ్బంది పెట్టే సీన్ మల్లెమాలకు ఇప్పుడు లేదు. అన్నం పెట్టి, గుర్తింపును ఇచ్చిన జబర్దస్త్ను ఎప్పటికీ వీడను అని ఎన్నో సార్లు సుధీర్ చెప్పాడు. మరి ఇప్పుడు నిజంగానే బయటకు వచ్చేశాడా? లేదంటూ ఇవన్నీ గాలి వార్తలేనా? అనేది మున్ముందు తేలనుంది.