• November 7, 2021

Rashmika Mandanna: రాత్రంతా అదే పని.. టార్చర్‌గా ఉంది : రష్మిక మందన్నా

Rashmika Mandanna: రాత్రంతా అదే పని.. టార్చర్‌గా ఉంది : రష్మిక మందన్నా

    Rashmika Mandanna రష్మిక మందాన్న ప్రస్తుతం అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఆఫర్లను పట్టేస్తోంది. కన్నడ సుందరి అయినా కూడా ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. నేషనల్ క్రష్ అంటూ ఆమెకు ఒక గుర్తింపు కూడా వచ్చింది. అయితే ఈ ఏడాది ఆ టైటిల్‌ను నిధి అగర్వాల్ కొట్టేసింది. అయినా కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఎక్కడా కూడా తగ్గలేదు. కోలీవుడ్‌లో గ్రాండ్‌గానే ఎంట్రీ ఇచ్చింది. కార్తీ హీరోగా ఈ ఏడాది వచ్చిన సుల్తాన్ సినిమాలో రష్మిక నటించింది.

    అలా తమిళ ప్రేక్షకులను నేరుగా రష్మిక పలకరించింది. మొత్తానికి రష్మిక మాత్రం ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తిరుగుతోంది. ఆమె చేతిలో ప్రస్తుతం రెండు హిందీ చిత్రాలు, రెండు తెలుగు సినిమాలున్నాయి. అన్నీ కూడా సెట్స్ మీదే ఉన్నాయి. ఇప్పుడు రష్మిక శర్వానంద్ కలిసి షూటింగ్లో పాల్గొంటోన్నట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

    గతవారమే.. ఆ చిత్ర యూనిట్ రాజమండ్రికి చెక్కేసింది. అక్కడే కొన్ని సీన్లను తెరకెక్కిస్తోంది. ఇదే విషయాన్ని రష్మిక చెప్పింది. రాత్రంతా షూట్ చేసి వచ్చాను.. ఇప్పుడే వచ్చాను కానీ నిద్ర పట్టడం లేదు.. ఎంతో ట్రై చేశాను.. ఓ గంట సేపు అటూ ఇటూ నడిచాను.. నిద్ర పట్టడమేలేదు.. ఈ టార్చర్ నాకు మాత్రమే ఎందుకు.. ఎందుకు? అంటూ రష్మిక తనలో తానే తెగ బాధపడుతోంది. ఇక పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా అల్లు అర్జున్ పక్కన అదరగొట్టేసేందుకు రెడీ అయింది.

    Leave a Reply