Site icon A2Z ADDA

‘హీరో’తో వెండితెరపైకి ఎంట్రీ.. స్టేజ్ మీద భయపడ్డ కార్తీక దీపం సౌందర్య

కార్తీక దీపం సీరియల్‌తో బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అర్చన. సౌందర్య పాత్రలో అర్చన అదరగొట్టేస్తున్నారు. ఆమె రూపం, ఆమె హుందాతనం అన్నీ కూడా పాత్రకు సరిగ్గా సరిపోయాయి. ఆమె ఇప్పుడు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అశోక్ గల్లా హీరో సినిమాతో అర్చన వెండితెరకు పరిచయం కాబోతోన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

నటి అర్చన మాట్లాడుతూ.. ‘తెలుగులో ఇది నా మొదటి చిత్రం. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. గగన్ వాళ్లు బుల్లితెరపై నాకు జన్మను ఇచ్చారు. వెండితెరపై అమర్ రాజా బ్యానర్ నాకు జన్మనిచ్చింది. మొదటి చిత్రంలోనే చాలా మంది పెద్ద ఆర్టిస్ట్‌లతో నటించే అవకాశం వచ్చింది. అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

సెట్‌లో నేనే ఎవ్వరికీ కనిపించేదాన్ని కాదు. షాట్ అయిన వెంటనే.. వెళ్లిపోవాలా? అని డైరెక్టర్‌ని అడిగేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక స్టేజ్ మీద సినిమా డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టుకుంది. అయితే డైలాగ్ చెప్పేందుకు అర్చన కాస్త తడబడింది. కానీ డైరెక్టర్ యాక్షన్ అని చెప్పడంతో.. స్టేజ్ మీద డైలాగ్ చెప్పేసింది. మొత్తానికి ఈ సినిమాతో వెండితెరపైనా అర్చన మంచి క్రేజ్ దక్కించుకుంటుందోమో చూడాలి.

Exit mobile version